లక్నో : సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో బరిలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు ప్రియాంశు రజవత్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాడు. ఈ యేడాది ఆర్లియన్స్ టోర్నీని గెలుచుకున్న ప్రియాంశు గురువారం స్వదేశానికే చెందిన సతీష్ కుమార్తో జరిగిన పోరులో 21-18, 11-6తో ముందంజలో ఉన్న సమయంలో ప్రత్యర్థి ఆటనుంచి తప్పుకోవడంతో ముందంజవేశాడు.
మహిళల డబుల్స్లో కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక జోడి గాయత్రి గోపిచంద్-త్రిషా జాలికూడా ముందడుగు వేశారు. వారు 21-9, 21-5తో స్వదేశానికే చెందిన ధన్య నందకుమార్-రిధి కౌర్ తోర్పై సునాయాసంగా గెలుపొందారు.