IPL 2022 | ఐపీఎల్-2022 టోర్నీలో శుక్రవారం హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ను సన్రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. చివరిలో ఆండ్రూ రస్సెల్ నిలకడగా ఆడటంతో ఎనిమిది వికెట్లు కోల్పోయిన కోల్కతా నైట్ రైడర్స్.. హైదరాబాద్ సన్ రైజర్స్ ముందు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
కోల్కతాలో బ్యాట్స్మన్లు నితీశ్ రాణా 54, ఆండ్రూ రస్సెల్ 49, శ్రేయస్స్ అయ్యర్ 28 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మన్లు వెంట వెంటనే పెవిలియన్ దారి పట్టారు. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీస్తూ కోల్కతా నైట్ రైడర్స్పై ఒత్తిడి తేవడంలో సన్ రైజర్స్ బౌలర్లు విజయవంతం అయ్యారు. కేవలం ఐదు ఓవర్లు ముగిసే సరికి ముగ్గురు బ్యాట్స్మన్లను సన్ రైజర్స్ బౌలర్లు సాగనంపారు.
సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ రెండు, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, సుచిత్ తలో వికెట్ తీసుకున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి కోల్కతా 70 పరుగులే చేసింది. నితీశ్ రాణాతో కలిసి జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తున్న శ్రేయస్ అయ్యర్ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.