హైదరాబాద్, ఆట ప్రతినిధి : జపాన్ వేదికగా జూన్లో జరిగే ఆసియా కప్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో బరిలో దిగే భారత శిబిరానికి ఎస్సీ గురుకుల విద్యార్థి వినయ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు జాతీయ సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుంచి మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం బోధన్ గురుకులంలో చదువుతున్న వినయ్…సాఫ్ట్బాల్ క్రీడలో అంచలంచెలుగా ఎదిగాడు. ఏషియన్ టోర్నీకి సన్నాహకంగా జరుగనున్న శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారిని భారత జట్టుకు ఎంపిక చేయనున్నారు.