హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరిగిన ఫెనెస్టా జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్లో కార్తీక్రెడ్డి, మనీశ్ సురేశ్కుమార్ జోడీ 6-4, 6-3తో నితిన్కుమార్ సిన్హా, ఇషాక్ ఇక్బాల్ ద్వయంపై అద్భుత విజయం సాధించింది.