ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ టోర్నీ శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. పోటీలను ఏసీపీ రఘు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాల నుంచి బాలుర జట్లు, 6 ఉమ్మడి జిల్లాల నుంచి బాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీ రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. తొలి రోజు బాలుర విభాగం పోటీల్లో నల్లగొండపై రంగారెడ్డి, మహబూబ్నగర్పై కరీంనగర్, నిజామాబాద్పై రంగారెడ్డి గెలిచాయి.