Star Cricketers As Commentators : ప్రపంచ క్రికెట్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు అద్భుత ఇన్నింగ్స్లతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు. వీళ్లలో కొందరు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తి ఆటతో కొనసాగారు. దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), ఇయాన్ చాపెల్(Ion Chappell), రవిశాస్త్రి(Ravi Shastri), వాసిం అక్రమ్(Wasim Akram) వంటి వారు క్రికెట్కు గుడ్బై చెప్పేసిన వెంటనే కామెంట్రీ బాక్స్లో ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికీ వాళ్లు తమ క్రికెట్ వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నారు. ఆ తర్వాత కూడా మరెందరో ఆటగాళ్లు వీళ్ల బాటలోనే నడిచారు. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత కొందరు క్రికెటర్లు కామెంటేటర్లుగా కొత్త అవతారం ఎత్తారు. రిటైర్మెంట్ తర్వాత కూడా అభిమానులను పలకరిస్తూ మైదానంలో సందడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కూడా ఉన్నాడు.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్గేల్(Chris Gayle) నవంబరు 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడడంలేదు. అలాగనీ ఈ యూనివర్సల్ బాస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. కాకపోతే, అతను ఎప్పుడైనా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. 2009 తర్వాత తొలిసారి 2022 ఐపీఎల్(IPL)కు గేల్ దూరంగా ఉన్నాడు. 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్బాక్స్ ఈవెంట్లో పాల్గొన్నాడు. అంతేకాదు, జియో సినిమాతో కలిసి ఐపీఎల్ 2023 కామెంట్రీ ప్యానెల్లో భాగమయ్యాడు.
కామెంటరీ బాక్స్లో అనిల్ కుంబ్లేతో క్రిస్ గేల్
బ్రెట్ లీ, స్కాట్ స్టైరిస్, ఇయాన్ మోర్గాన్, గ్రేమ్ స్వాన్ వంటి దిగ్గజాలతో కామెంట్రీ బాక్స్ పంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్తో గేల్ తొలిసారి కామెంటేటర్గా కనిపించాడు. అయితే, అంతగా ఆకట్టుకోలేకపోవడంతో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కూడా కామెంటేటర్గా రాణిస్తున్నాడు. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో ఐదో నంబరులో బ్యాటింగ్కు వచ్చిన కార్తీక్ ఆరు పరుగులు చేశాడంతే. ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు లభించలేదు. దాంతో, 2021లో ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటన సమయంలో ఈ వికెట్ కీపర్ కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20తో కామెంట్రీ బాక్స్లో కాలుపెట్టాడు.
దినేశ్ కార్తీక్, రవిశాస్త్రి
ఆ తర్వాత జరిగిన మూడు వన్డేలకూ కామెంట్రీ చెప్పాడు. జూన్ 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్కు కూడా కార్తీక్ కామెంట్రీ చెప్పాడు. డబ్ల్యూటీసీ గ్రౌండ్ కామెంటరీలో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar)తో కలిసి కనిపించిన మరో భారతీయుడు దినేశ్ కార్తీక్ మాత్రమే. 2023 యాషెస్ సిరీస్లో నాసిర్ హుస్సేన్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, మార్క్ టైలర్ వంటి వారితో కలిసి అతను కామెంటరీ బాక్స్ను పంచుకున్నాడు. అంతేకాదు, ఇంగ్లండ్లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ కామెంటరీ ప్యానెల్లోనూ కార్తీక్ చోటు దక్కించుకున్నాడు.
ఇంగ్లండ్ క్రికెట్కు ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) కొత్త భాష్యం చెప్పాడు. అతడి కెప్టెన్సీలో జట్టు కొత్త పుంతలు తొక్కింది. ఇంగ్లండ్ తొలిసారి 2019 వన్డే ప్రపంచకప్ను అందుకుంది మోర్గాన్ సారథ్యంలోనే. ఆ తర్వాత కొన్నాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగిన మోర్గాన్ జూన్ 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే `స్కై స్పోర్ట్స్` కామెంటరీ ప్యానెల్లో భాగస్వామి అయ్యాడు.
యాషెస్ సిరీస్ వ్యాఖ్యాతగా మోర్గాన్
నిరుడు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచ కప్లో సునీల్ గవాస్కర్, ఆడం గిల్క్రిస్ట్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ సహా మరికొందరితో కలిసి కామెంటరీ బాక్స్లో సందడి చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న మోర్గాన్.. ఐపీఎల్ 2023లో జియో సినిమాకు కూడా కామెంటేటర్గా వ్యవహరించాడు. ఇటీవల సొంత గడ్డపై ముగిసిన యాషెస్ సిరీస్లో స్కై స్పోర్ట్స్కు కామెంటరీ చెప్పాడు.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్() గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. టీ20 ప్రపంచకప్లో జట్టును నడిపించిన అతను 11 ఏళ్ల కెరియర్లో 254 మ్యాచ్లు ఆడాడు. 2018 నుంచి రిటైర్మెంట్ ప్రకటించే వరకు వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
ఐపీఎల్ 2023లో కామెంటేటర్ ఫించ్
క్రికెట్ నుంచి తప్పుకున్నాక కామెంటేటర్ అవతారం ఎత్తాడు. డేవిడ్ హస్సీ(David Hussey)తో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో కామెంటరీ చెప్పాడు. ఫాక్స్ క్రికెట్కు పార్ట్ టైమ్ కామెంటేటర్గానూ ఫించ్ వ్యవహరించాడు. మే 2023లో `నైన్స్ వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్`తో యాషెస్ సిరీస్(Ashes Series) కోసం ఫించ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
జీన్పాల్ డుమినీ(Jean-Paul Duminy) సౌతాఫ్రికాకు 2004 నుంచి 2019 వరకు(15 ఏళ్లపాటు) ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20లకు అందుబాటులో ఉన్నప్పటికీ డుమినీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీంతో జనవరి 2020లో ఈ ఆల్రౌండర్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.
జేపీ డుమినీ
ఐపీఎల్ 2020లో స్టార్ స్పోర్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుని బ్రాడ్కాస్ట్ బృందంలో సభ్యుడయ్యాడు. డుమినీ తొలిసారి 2018లో సౌతాఫ్రికా బోర్డు నిర్వహించిన ఎంజాన్సీ సూపర్ లీగ్ ఓపెనింగ్ ఎడిషన్లో కామెంట్రీ చెప్పాడు. 2021 ఐపీఎల్కు కూడా స్టార్స్పోర్ట్స్తో కలిసి పనిచేశాడు. ఆ ఎడిషన్లో ఇయాన్ బిషప్, సునీల్ గవాస్కర్, డేనీ మోరిసన్, ఎంబంగ్వా వంటివారితో కామెంటరీ బాక్స్లో కనిపించాడు.
2016 టీ20 ప్రపంచ కప్ ఫైనల్తో విండీస్ ఆల్రౌండర్ బ్రాత్వైట్(Carlos Brathwhite) లైమ్లైట్లోకి వచ్చాడు. ఇంగ్లండ్పై ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది జట్టుకు ట్రోఫీ అందించిపెట్టాడు. 2019 ప్రవంచకప్ జట్టులోనూ బ్రాత్వైట్ కీలకంగా మారాడు. . న్యూజిలాండ్పై సెంచరీ సాధించాడు. 8 మ్యాచ్ల్లో 154 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ తర్వాత ఇండియాతో వన్డేలు, టీ20 సిరీస్లో బ్రాత్వైట్
కార్లోస్ బ్రాత్వైట్
రాణించలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టారు. దీంతో గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో కామెంట్రీ ప్యానెల్లో చేరాడు. 2023 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో నెదర్లాండ్స్ చేతిలో విండీస్ ఓటమి పాలైన తర్వాత షాక్ గురైన బ్రాత్వైట్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.