హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హాకీ లెజెండ్స్ ప్రీమియర్ లీగ్ (హెచ్ఎల్పీఎల్) ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ జట్టు జెర్సీని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో తెలంగాణ హాకీ ప్రీమియర్ లీగ్ను ప్రారంభిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. క్రీడాకారులు 8 జట్లుగా విడిపోయి ఈ లీగ్లో పాల్గొంటారని, ఉత్తమ ప్రతిభ కనబరిచినవారు జాతీయ జట్టుకు ఎంపిక అవుతారన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ఎం.ముశ్, తెలంగాణ హాకీ అసోసియేషన్ ఛైర్మన్ కొండ విజయ్, భాస్కర్రెడ్డి, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.