కోల్కతా: భారత్తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లంక ప్లేయర్లు పాథుమ్ నిస్సంకా, దిల్షాన్ మధుశంకలు ఈ మ్యాచ్కు దూరం అయ్యారు. గాయాల కారణంగా ఆ ఇద్దర్నీ తప్పించారు. ఈ మ్యాచ్లో నువనిదు ఫెర్నాండో అరంగేట్రం చేస్తున్నాడు. దిల్షాన్ స్థానంలో లహిరు కుమారను తీసుకున్నారు. ఇండియా జట్టులో ఒక మార్పు చేశారు. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. కుడి భుజానికి గాయం కావడం వల్ల చాహల్ను పక్కనపెట్టారు.
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
A look at our Playing XI for the game.
Live – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/DKNDtd6rYT
— BCCI (@BCCI) January 12, 2023