సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ (42 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (41) అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు జోస్ బట్లర్ (35), యశస్వి జైస్వాల్ (20) శుభారంభమే అందించారు. జైస్వాల్ అవుటైన తర్వాత వచ్చిన శాంసన్ వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ మెరుపులు మెరిపించాడు. ముందుగా బట్లర్ను అవుట్ చేసిన అతను.. ఆ తర్వాత చూడచక్కని షాట్లతో అలరిస్తున్న పడిక్కల్ను కూడా పెవిలియన్ చేర్చాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో రాజస్థాన్ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే 15వ ఓవర్ చివరి బంతికి ఉమ్రాన్ మాలిక్.. పడిక్కల్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 148/3 స్కోరుతో నిలిచింది.