హనుమకొండ చౌరస్తా: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన 34వ సౌత్జోన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను తమిళనాడు దక్కించుకుంది. అండర్-14 బాలుర, బాలికల విభాగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా అండర్-16, 18, 20 విభాగాల్లో తమిళనాడు నిలిచింది. జేఎన్ఎస్లో మూడు రోజులుగా జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి.
అండర్-14, 16, 18, 20 విభాగాల వారిగా పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 800 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనగా మొత్తం 140 ఈవెంట్లలో క్రీడా పోటీలు జరిగాయి. సౌత్జోన్ అథ్లెటిక్స్ జాతీయస్థాయి టోర్నీలో తెలంగాణ 16స్వర్ణాలు, 29 రజతాలు, 21 కాంస్యాలతో మూడో స్థానంలో నిలిచింది.