బ్రిస్టల్ : ఐర్లాండ్తో జరిగిన తొలి టి20మ్యాచ్లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ రేజా హెండ్రిక్స్ వరుసగా నాలుగో అర్ధసెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 211 పరుగులు చేయగా సమాధానంగా ఐర్లాండ్ 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది.
సఫారీ ఇన్నింగ్స్లో రేజా 38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు సాధించాడు. ఐడెన్ మార్క్మ్ 27 బంతుల్లో రెండు ఫోర్లు అయిదు సిక్సర్లతో తన వంతు సహకారం అందించి 56 పరుగులు చేయగా, చివరలో ట్రిస్టాన్ స్టబ్స్ 24, ప్రిటోరియస్ 21 పరుగులతో రాణించారు. ఐర్లాండ్ జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చింది. వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ అర్ధసెంచ రీ(78) సాధించగా, చివరలో జార్జి డాక్రెల్ 43 పరుగులతో దడపుట్టించాడు.
హేగ్: నెదర్లాండ్స్తో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత న్యూజిలాండ్ 7 వికెట్లకు 148 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ మూడు బంతులు మిగిలి ఉండగా 132 పరుగులకు ఆలౌటయింది. నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డి లీ డి 66 పరుగులతో రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు.