హైదరాబాద్: రానున్న ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఎడెన్ మార్క్మ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ యజమాన్యం గురువారం తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘నిరీక్షణ ముగిసింది. ఆరెంజ్ ఆర్మీ..మన కొత్త కెప్టెన్ మార్క్మ్క్రు స్వాగతం పలకండి’ అంటూ ట్వీట్ చేసింది.
గత సీజన్ వరకు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్.. హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే విలియమ్సన్ను వదిలేసుకున్న సన్రైజర్స్ ఈసారి కొత్త కూర్పుతో బరిలోకి దిగుతున్నది. ఏప్రిల్ 2న జరిగే తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్తో రైజర్స్ తలపడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా 20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను ఎడెన్ విజేతగా నిలిపాడు.