బులవాయొ: ఇటీవలే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) గెలిచిన ఊపులో ఉన్న దక్షిణాఫ్రికా.. ప్రస్తుత సైకిల్ (2025-27)నూ ఘనంగా ఆరంభించింది. బులవాయొ వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో సఫారీలు.. ప్రత్యర్థిపై 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందారు.
జింబాబ్వే ఎదుట 537 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సౌతాఫ్రికా.. ఆ జట్టును 208 పరుగులకే ఆలౌట్ చేసింది.