కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ చికిత్స చేసినట్లు కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ రూపాలీ బాసు తెలిపారు. డిసెంబర్ 27వ తేదీన వుడ్ల్యాండ్స్ మల్లీస్పెషాలిటీ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ స్టేటస్తో గంగూలీ అడ్మిట్ అయినట్లు డాక్టర్ రూపాలీ తెలిపారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని, హీమోడైనమికల్లీ స్టేబుల్గా ఉన్నట్లు చెప్పారు. డాక్టర్ సరోజ్ మోండల్, డాక్టర్ సప్తర్షి బాసు, డాక్టర్ సౌతిక్ పాండాలతో కూడిన మెడికల్ బోర్డు గంగూలీ ఆరోగ్య పరిస్థితి అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ దేవీ శెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ కూడా ఆ బోర్డుకు తోడుగా ఉన్నట్లు రూపాలీ ఓ ప్రటకనలో చెప్పారు.