క్రికెట్ను ప్రపంచానికి మరింత చేరువ చేసిన ఐకానిక్ ఆటగాళ్లతో నిర్వహించే లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి సీజన్ అద్భుతంగా అలరించింది. అదే జోరులో రెండో సీజన్ నిర్వహించాలని ఈ లీగ్ నిర్వాహకులు భావిస్తున్నారు. దీనికోసం సన్నాహకాల్లో భాగంగా మాజీ లెజెండ్స్ను సంప్రదిస్తున్నారు.
వారిలో ఎవరెవరు ఆడుతున్నారో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఒక వార్త అందరినీ ఉర్రూతలూగించింది. అదేంటంటే.. బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ కూడా రెండో సీజన్లో మురుస్తున్నాడని.
ఈ వార్తలో నిజమెంత? అని నేరుగా గంగూలీని ప్రశ్నిస్తే మాత్రం వేరే సమాధానం వచ్చింది. తను ఎలాంటి లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పాల్గొనడం లేదని గంగూలీ తేల్చేశాడు. ఈ వార్త తప్పన్నాడు. అయినా సరే ట్విట్టర్ పోస్టును లెజెండ్స్ లీగ్ నిర్వాహకులు డిలీట్ చెయ్యలేదు. దాంతో అసలు గంగూలీ ఆడతాడా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాకుండా పోయింది.
కాగా, ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ వంటి వాళ్లంతా తాము సీజన్ 2 లెజెండ్స్ లీగ్ ఆడుతున్నట్లు ధ్రువీకరించారు. మరి దాదా కూడా మనసు మార్చుకుంటాడేమో చూడాలి.
Here we go! One of India's most iconic captains and cricket's all-time greats Dada @SGanguly99 is now on #BossLogonKaGame.
Legends don't get bigger than this! Welcome to @llct20, #Dada. @DasSanjay1812#BossGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/hbCCypmJCT
— Legends League Cricket (@llct20) July 20, 2022