కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా బారిన పడి స్థానిక హాస్పిటల్లో చేరిన 49 ఏండ్ల దాదా.. చికిత్స అనంతరం శుక్రవారం ఇంటికి చేరాడు. అయితే మరికొన్ని రోజుల పాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్లో ఉండనున్నట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న దాదాకు ఒమిక్రాన్ సోకలేదని వైద్య బృందం తెలిపింది.