ముంబై: ఫుట్బాల్లో ప్రతిష్ఠాత్మక లీగ్లుగా భావించే యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, యూఈఎఫ్ఏ యూరోపా లీగ్, యూఈఎఫ్ఏ కాన్ఫరెన్స్ లీగ్ ప్రసార హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. రానున్న మూడు సీజన్లకు సంబంధించిన ప్రసారాలు సోనీ పిక్చర్స్ నెటవర్క్స్ ఇండియాలో రానున్నాయి. ఈ ఒప్పందం పునరుద్ధరణ 2024-25 సీజన్ నుంచి 2026-27 సీజన్ వరకు మూడు సీజన్ల పాటు కొనసాగనుంది.
ఒప్పందంలో భాగంగా ప్రసారదారు 1600పైగా మ్యాచ్లను నెట్వర్స్ చానల్స్లో ప్రసారం చేస్తుంది. భారత్లో ఫుట్బాల్ ఫ్యాన్స్ తమ అభిమాన జట్లు రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్, బేయర్స్ మ్యూనిచ్, అర్సెనల్, మాంచెస్టర్ సిటీ, లివర్పూల్ మ్యాచ్లను ఆస్వాదించనున్నారు. ప్లేయర్ల విషయానికొస్తే..కిలియన్ ఎంబాపె, బ్రూనో ఫెర్నాండెజ్, బెల్లింగ్హామ్, హ్యారీకేన్, రాబర్ట్ లెవాన్డోవ్స్కీ స్టార్ల విన్యాసాలు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. యూఈఎఫ్ఏతో ఒప్పందం కుదుర్చుకోవడం బాగుందని సోనీ ప్రతినిధి రాజేశ్ పేర్కొన్నారు.