బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత్కు చెందిన యువ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తున్నది. ఉత్తరప్రదేశ్కు చెందిన బౌలర్ యశ్ దయాల్ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. యశ్ దయాల్ 1997, డిసెంబర్ 13న యూపీలోని ప్రయాగ్ రాజ్లో జన్మించాడు. 2018 సెప్టెంబర్లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
2018, నవంబర్ 1న రంజీ ట్రోఫీ ద్వారా యూపీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రవేశించాడు. 2019, ఫిబ్రవరిలో ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్ ఫార్మాట్లో రంగ ప్రవేశం చేశాడు. ఇక ఇటీవల వరల్డ్కప్ గెలిచిన అండర్-19 టీమ్లోని ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవాను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. భారత్ ప్రపంచకప్లో గెలువడంలో రాజ్బవా కీలకపాత్ర పోషించాడు.
ఇక, అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్లోని మరో ఆల్రౌండర్ రాజ్వర్దన్ హంగార్గేకర్ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.1.50 కోట్లకు దక్కించుకున్నది. శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్ గత ఏడాది భారత్ తరఫున ఆడలేదు. అయినా వాళ్లకు ఈ ఐపీఎల్ భారీ మొత్తాలు దక్కాయి. ఈ ఐపీఎల్ వేలంలో చేతన్ సకారియా పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సకారియాను రూ.4.20 కోట్లకు కొన్నది.