హైదరాబాద్: ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, గోపీచంద్ అకాడమీ మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయు) కుదిరింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు గురుకుల అకాడమీల ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నందిని, ప్రణయ్, లావణ్య, భాగ్యలక్ష్మి, మాయావతి, రవికిరణ్ లాంటి ప్లేయర్లు పతకాలతో మెరువగా, మరింత మంది ప్లేయర్లు ప్రతిభను నిరూపించుకునే అవకాశముంది. ఈ కార్యక్రమంలో గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్, గురుకులాల అధికారులు చంద్రకాంత్రెడ్డి, సర్వేశ్వర్రెడ్డి, రామ్లక్ష్మణ్ పాల్గొన్నారు.