న్యూఢిల్లీ: ఫుట్బాల్ వరల్డ్కప్ టోర్నీ ఆరంభం సమయంలో అమెరికా జర్నలిస్టు గ్రాంట్ వాల్ను ఖతార్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెయిన్బో రంగుల్లో ఉన్న టీషర్ట్ను అతను ధరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వరల్డ్కప్ మ్యాచ్లపై రిపోర్ట్ ఇస్తున్న జర్నలిస్టు గ్రాంట్ వాల్.. అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కుప్పకూలిపోయాడు. గ్రాంట్ మరణం వెనుక ఖతార్ ప్రభుత్వ హస్తం ఉన్నట్లు ఆయన సోదరుడు ఎకరిక్ ఆరోపించారు.
వరల్డ్కప్ ప్రారంభం సమయంలో ఎల్జీబీటీ వర్గానికి మద్దతుగా గ్రాంట్ వాల్ రెయిన్బో రంగు టీషర్ట్ వేసుకున్నాడు. నిరసన వ్యక్తం చేస్తున్న గ్రాంట్ను అధికారులు తొలుత స్టేడియంలోకి రానివ్వలేదు. ఈ ఘటన పట్ల ఫిఫా క్షమాపణలు చెప్పింది. ఆ తరువాత మ్యాచ్ను వీక్షించేందుకు గ్రాంట్ను స్టేడియంలోకి రానిచ్చారు.