ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ తడబడుతోంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు భానుక రాజపక్స (71 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్తో 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ను లంక యువపేసర్ ప్రమోద్ మదుశన్ దెబ్బకొట్టాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (5), ఫకర్ జమాన్ (0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. దీంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే మహమ్మద్ రిజ్వాన్ (16 నాటౌట్) చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. అతనితోపాటు ఇఫ్తికార్ అహ్మద్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. దీంతో పాకిస్తాన్ జట్టు పవర్ప్లే ముగిసేసరికి 37/2 స్కోరుతో నిలిచింది.