హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో శివ, వేదాన్ష్, అర్జున్ పసిడి పతకాలు సాధించారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో అండర్-12 50 కేజీల కాటా విభాగంలో శివ దీపేశ్ పాత్రో స్వర్ణం నెగ్గగా, 45 కేజీల ఈవెంట్లో దేవాన్ష్ ప్రసాద్ పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. 55 కేజీల కుమిటేలో అర్జున్ అభిలాష్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. వేర్వేరు విభాగాల్లో అభిరామ్ (కాటా, రజతం), ఆరవ్ (కుమిటే, స్వర్ణం), భవ్య మీనాక్షి (కుమిటే, కాంస్యం), మోహిత్ (కాటా, కాంస్యం), అభినవ్ (కాటా, రజతం) పతకాలు నెగ్గారు.