లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) క్వార్టర్స్కు ప్రవేశించాడు. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన మెన్స్ సింగిల్స్ పోరులో టాప్ సీడ్ సినర్.. 6-3, 7-6 (7/0), 6-3తో షింటారొ మొచిజుకి (జపాన్)పై అవలీలగా గెలిచాడు. ఐదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా).. 5-7, 6-7 (4/7), 3-6తో ఫ్లావియొ కొబొలి (ఇటలీ) చేతిలో ఓడి ప్రిక్వార్టర్స్లోనే ఇంటిబాట పట్టాడు. మహిళల సింగిల్స్లో స్వియాటెక్కు షాకిచ్చిన ఫిలిప్పీన్స్ యువ సంచలనం అలగ్జాండ్రా ఈలా పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. ఈలా 4-6, 6-4, 3-6తో పౌలిని చేతిలో కంగుతింది. గాఫ్ 4-6, 6-3, 6-4తో బెలిందా (స్విట్జర్లాండ్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.