కొరియా ఓపెన్
సన్చియాన్ (కొరియా): కొరియా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్ సింధు 21-15, 21-14తో లౌరెన్ లామ్ (అమెరికా)ను చిత్తు చేయగా.. పురుషుల పోరులో శ్రీకాంత్ 22-20, 21-11తో డారెన్ లై (మలేషియా)ను ఓడించి ముందంజ వేశారు. అమెరికా షట్లర్ను తెలుగమ్మాయి సింధు సునాయాసంగా ఓడించింది. రెండు గేముల్లోనూ పూర్తి ఆధిక్యంతో గేమ్ను చేజిక్కించుకుంది.
తొలి గేమ్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న శ్రీకాంత్.. రెండో గేమ్లో ప్రత్యర్థిపై వీరోచితంగా పోరాడి భారీ ఆధిక్యంతో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి పోరులో అయ ఓహోరి (జపాన్)తో సింధు, మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)తో శ్రీకాంత్ తలపడనున్నారు. పురుషుల డబుల్స్లో చిరాగ్ శెట్టి- సాత్విక్సాయిరాజ్, అర్జున్- ధ్రువ్ కపిల్ జోడీలతో పాటు మిక్స్డ్ డబుల్స్లో అశ్వినీ పొన్నప్ప- సుమిత్ రెడ్డి జంట ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది.