ముంబై : ఆస్ట్రేలియా(India Vs Australia)తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు చెందిన భారతీయ జట్టును ప్రకటించారు. టీమిండియా వన్డే జట్టుకు శుభమన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక టీ20 సిరీస్ మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ సారధ్య బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆ మ్యాచ్లు ఉంటాయి. సీనియర్స్ మెన్స్ సెలక్షన్ కమిటీ భారత బృందాన్ని ఎంపిక చేసింది. అయితే వన్డేల్లో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఛాన్స్ దక్కింది. ఆ ఇద్దర్నీ ఆసీస్తో సిరీస్కు ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్కు అప్పగించారు. వన్డేలకు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. వన్డే టీమ్లో నితీశ్, సుందర్, కుల్దీప్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ, ద్రువ్ జురెల్ , జైస్వాల్ కూడా ఉన్నారు.
ఆసీస్తో జరిగే టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆ జట్టులో అభిషేక్ శర్మ, గిల్, తిలక్ వర్మ, నితీశ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ సాంసన్, రింకూ సింగ్, సుందర్ ఉన్నారు. అయితే వన్డే జట్టుకు స్పీడ్ ఔలర్ బుమ్రాను ఎంపిక చేయలేదు.
తొలుత వన్డేలు జరుగుతాయి. అక్టోబర్ 19వ తేదీన పెర్త్లో ఫస్ట్ వన్డే, అడిలైడ్లో 23న రెండో వన్డే, 25న సిడ్నీలో మూడో వన్డే ఆడనున్నారు. తొలి టీ20 అక్టోబర్ 29వ తేదీన కెనబెరాలో జరగనున్నది. మెల్బోర్న్లో రెండో టీ20 అక్టోబర్ 31వ తేదీన, మూడవ మ్యాచ్ నవంబర్ 2న హోబర్ట్లో, నాలుగో టీ20 గోల్డ్ కోస్టులో నవంబర్ 6న, 5వ టీ20 బ్రిస్బేన్లో నవంబర్ 8వ తేదీన ఆడుతారు.
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
— BCCI (@BCCI) October 4, 2025
కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్ శర్మకు తెలియజేసినట్లు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తెలిపారు.