హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో శుభమ్ కుమార్ విజేతగా నిలిచాడు. బిలో 1600 ఎలో రేటింగ్ ప్లేయర్ల మధ్య నిర్వహించిన ఈ టోర్నీలో అమెరికా, కెనడా సహా భారత్ నుంచి దాదాపు 600 మంది ఆటగాళ్లు పాల్గొన్నారని నిర్వాహకులు నవీన్ కుమార్ తెలిపారు. తెలంగాణకు చెందిన యశ్వి జైన్ ద్వితీయ స్థానం దక్కించుకోగా..
ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ తృతీయ బహమతి గెలుచుకున్నాడు. విజేతకు లక్ష రూపాయలు, రన్నరప్ యశ్వికి రూ. 60 వేలు, సెకండ్ రన్నరప్ సాత్విక్కు రూ.40 వేలు దక్కాయి. హైదరాబాద్లోని యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.