Shoaib Malik : భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, వీళ్లిద్దరు కలిసి ఈ మధ్య ఓటీటీలో ది మీర్జా మాలిక్ అనే రియాలిటీ టాక్ షోలో పాల్గొన్నారు కూడా. దాంతో, అసలు వీళ్లు నిజంగానే విడాకులకు దరఖాస్తు చేశారా? లేదా? అనే ప్రశ్న చాలామందిలో మొదలైంది. ఈ విషయంపై తాజాగా షోయబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అది మా వ్యక్తిగత విషయం. ఆ విషయాన్ని మాకు వదిలేయండి. ఈ ప్రశ్నకు నేనుగానీ, నా భార్యగానీ ఎక్కడా సమాధానం ఇవ్వలేదు’ అని మీడియాతో షోయబ్ అన్నాడు.
సానియా, షోయబ్లు 2010లో వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఇజాన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఏమైందో తెలియదు ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసింది. కానీ, వీళ్లకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దాంతో విడాకులు మరితం ఆలస్యం కానున్నాయి. దాంతో, సానియా, మాలిక్లు తమ ప్రొఫెషన్ కమిట్మెంట్స్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో ఒకటి ది మీర్జా మాలిక్ షో. ఈషో త్వరలోనే పాకిస్థాన్కు చెందిన ఉర్దూఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది.
న్యాయపరమైన సమస్యలు పరిష్కారమైన తర్వాత ఇద్దరూ తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. షోయబ్ పాక్కు చెందిన యూట్యూబర్, నటి అయేషా ఒమర్తో ప్రేమలో ఉన్నాడని, అందుకనే సానియాతో డైవర్స్కు సిద్ధపడ్డాడని గుసగుసలు వినిపించాయి. కానీ, అయేషా ఆ వార్తల్ని కొట్టిపారేసింది. తనకు షోయబ్ మంచి మిత్రుడని, అతను తన భార్య సానియాతో సంతోషంగా ఉన్నాడని ఆమె చెప్పింది.