Shikhar Dhawan | న్యూజిలాండ్తో అమీతుమీకి టీమిండియా సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధావన్ సేన.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో క్రిస్ట్చర్చ్ వేదికగా బుధవారం జరగబోయే ఆఖరి మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైన గెలిచి 1-1తో సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు క్రిస్ట్చర్చ్కు పయనమయ్యారు. ఈ సందర్భంగా శిఖర్ ధావన్ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
వీడియోలో విమానాశ్రయం దగ్గర చాహల్ రెండు చేతులా అధిక లగేజీని మోసుకుంటూ వెళ్తుంటాడు. వెనుకవైపు నుంచి చాహల్ భార్య ధనశ్రీ వర్మ తక్కువ లగేజీతో వెళ్తుంటుంది. ఇది చూసిన ధావన్.. ధనశ్రీని సరదాగా ఆటపట్టిస్తాడు. ఛాహల్ను చూపిస్తూ ‘ చాహల్ను తన భార్య ధనశ్రీ అప్పుడే కూలీని చేసేసింది’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.