జోహాన్నస్బర్గ్: ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇవాళ ఉదయం డీన్ ఎల్గర్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 రన్స్ చేసింది. రెండో వికెట్కు పీటర్సన్, ఎల్గర్ మధ్య భారీ భాగస్వామ్యం నెలకొన్నది. అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 62 రన్స్ చేసిన పీటర్సన్ క్యాచ్ అవుట్ ఔటయ్యాడు. క్రీజ్లో బవుమా ఉన్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 202 రన్స్కు ఆలౌటైన విషయం తెలిసిందే. వాండర్ ఔట్ కాగానే.. భోజన విరామం తీసుకున్నారు.
శార్దూల్ ఇవాళ సూపర్ ఫామ్ను కనబరిచాడు. తన బౌలింగ్తో దక్షిణాఫ్రికాను కట్టడి చేశాడు. నిజానికి ఉదయం ఎల్గర్, పీటర్సన్లు నిలకడగా ఆడారు. కానీ శార్దూల్ ఆ భాగస్వామ్యానికి బ్రేకేశాడు. తొలుత ఎల్గర్ను ఔట్ చేసిన శార్దూల్ ఆ తర్వాత కూడా రెండు వికెట్లును తీసేశాడు. భోజన విరామ సమయానికి ముందు మ్యాచ్ను శార్దూల్ మలుపు తిప్పేశాడు. లంచ్కు ముందు 4.5 ఓవర్లలో శార్దూల్ 8 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో రెండవ టెస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.