న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పేరును ఈ యేటి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. రిటైర్డ్ జస్టిన్ ఏఎన్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సెలక్ష కమిటీ ఈ పేరును ప్రతిపాదించింది.40 ఏళ్ల శరత్ కమల్ ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ గేమ్స్లో అతను నాలుగు మెడల్స్ గెలిచాడు. దాంట్లో మూడు బంగారు, ఓ సిల్వర్ మెడల్ ఉన్నాయి.
ఈ ఏడాది ఖేల్ రత్నకు నామినేట్ అయిన ఒకే ఒక అథ్లెట్ శరత్ కమల్ కావడం విశేషం. ఏషియన్ గేమ్స్లోనూ శరత్ మెడల్స్ సాధించాడు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్కు ఖేల్ రత్న దక్కడం ఇది రెండవసారి అవుతుంది. గతంలో మానికా బత్రా ఈ అవార్డును గెలిచారు.
ఈ ఏడాది అర్జున అవార్డు కోసం 25 మంది క్రీడాకారుల పేర్లను ప్రతిపాదించారు. దాంట్లో లక్ష్యసేన్, నిఖత్ జరీన్, చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద, అన్షుమాలిక్, సరితా మోర్ ఉన్నారు. అర్జున అవార్డుకు ఈ ఏడాది ఒక్క క్రికెటర్ను కూడా రికమండ్ చేయలేదు.