హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంటాల్య(టర్కీ) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో సాయికార్తీక్రెడ్డి, సిద్దాంత్ బంటియా జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్లో కార్తీక్, సిద్దాంత్ ద్వయం 6-3, 3-6, 10-3తో సార్టియాస్ గోక్బెర్క్, మెట్ నాసి టర్కర్ జంటపై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన కార్తీక్, సిద్దాంత్ టైటిల్కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచారు.