Australia | పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాకు తుది జట్టులో 11 మంది ఆటగాళ్లు లేకపోవడంతో ఆ జట్టు హెడ్కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్, చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రూ బొరొవెక్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్వెల్, స్టోయినిస్ వంటి ప్లేయర్లు ఇంకా జట్టుతో చేరకపోవడంతో బుధవారం నమీబియాతో ఆడిన వామప్ మ్యాచ్లో ఆసీస్ 9 మందితోనే బరిలోకి దిగింది. కెప్టెన్ మార్ష్, హాజిల్వుడ్ మైదానాన్ని వీడినప్పుడు 46 ఏండ్ల బొరొవెక్, 49 ఏండ్ల బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ సైతం ఫీల్డింగ్కు వచ్చారు. కంగారూలు ఈ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.