న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) తొలి సీజన్ షెడ్యూల్ రానే వచ్చింది. ఏడు జట్ల కలయికతో ఫిబ్రవరి 5 నుంచి హైదరాబాద్ వేదికగా పీవీఎల్కు తెరలేవనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 23 రోజుల పాటు పీవీఎల్ అభిమానులను అలరించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పూర్తి బయోబబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహిస్తున్నారు. లీగ్ షెడ్యూల్ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు వచ్చే నెల 5న కొచ్చి బ్లూస్పైకర్స్తో తలపడుతుంది. ఏడు జట్లు హైదరాబాద్ బ్లాక్హాక్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూస్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టోర్పెడోస్, కోల్కతా థండర్బోల్ట్స్ ఉన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 27న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దేశంలో వాలీబాల్ ఉన్న ఆదరణను దృష్టిలో లీగ్కు రూపకల్పన చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు.