ఆలిండియా టెన్నిస్ టోర్నీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్(హెచ్వోటీఏ) ఆధ్వర్యంలో జరిగిన 11వ ఆలిండియా మాస్టర్స్ టోర్నీలో నంద్యాల నరసింహారెడ్డి, నీల్కాంత్ జోడీ డబుల్స్లో విజేతగా నిలిచింది. పురుషుల 50+ వయసు విభాగం ఫైనల్లో నరసింహారెడ్డి, నీల్కాంత్ ద్వయం 10-4తో వెంకటనారాయణ, రవిశంకర్ జోడీపై గెలిచింది. మిగతా విభాగాల్లో సందీప్ పవార్, శ్రీకాంత్, నీల్కాంత్, శంకర్, రామ్మోహన్రావు టైటిళ్లు దక్కించుకున్నారు. విజేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నరసింహారెడ్డి, రఘురామరెడ్డి, డీఐజీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.