మెల్బోర్న్: ఈ సీజన్తో కెరీర్కు వీడ్కోలు పలుకనున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సానియా మీర్జా-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 7-6 (8/6), 6-4తో ఎలెన్ పెరెజ్-మాడ్వే మిడ్కూప్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది. గంటా 27 నిమిషాల పాటు సాగిన పోరులో సానియా జోడీ 5 ఏస్లు సంధించి 4 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్లో స్టార్ ప్లేయర్ నాదల్ (స్పెయిన్) 7-6 (16/14), 6-2, 6-2తో మనారినోపై గెలిచి క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. బెర్టిని, మోన్ఫిల్స్, షపలోవ్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-4, 6-3తో అనిసిమోవాపై నెగ్గగా.. క్రెజికోవా, కైస్ చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.