న్యూఢిల్లీ: స్వల్ప విరామం తర్వాత మళ్లీ భారత టెన్నిస్ ప్లేయర్లు రాకెట్ పట్టనున్నారు. ఏప్రిల్ 12 నుంచి టర్కీ వేదికగా జరుగనున్న ఆసియా/ ఓషియానియా గ్రూప్-1 టోర్నీకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాటు మరో నలుగురు టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. బిల్లిజీన్ కింగ్ కప్ జట్టులో డబుల్స్లో సానియా, సింగిల్స్లో అంకితా రైనా, కర్మాన్ కౌర్, రుతుజ భోంస్లే, రియా భాటియా అదృష్టం పరీక్షించుకోనున్నారు. గతేడాది ప్లేఆఫ్స్ దశలో నిరాశ చెందిన భారత్ ఈసారి సత్తా చాటాలని తహతహలాడుతున్నది.