భువనేశ్వర్: T20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ప్రస్తుతం ఈ టోర్నీ సూపర్-12 దశకు చేరుకున్నది. ఇవాళ టోర్నీలో 16వ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనున్నది. ఈ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి నవీన్ పట్నాయక్ ఒక సుందరమైన సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. శిల్పం మధ్యలో క్రికెట్ పిచ్ చిత్రం వేసి, దాని చుట్టూ ఒక స్టేడియం ఆకారం నిర్మించారు.
స్టేడియం ఆకారంపై గుడ్ లక్ అని రాశారు. స్టేడియం ఆకారానికి ఇరువైపుల గోళాకారంలో భారత్, పాకిస్థాన్ జాతీయ పతాకాల చిత్రాలను రూపొందించారు. కింది భాగంలో టీ20 లోగో వేసి T20 వరల్డ్ కప్ అని రాశారు. ఈ కింది చిత్రంలో ఆ సైకత శిల్పాన్ని మీరు కూడా వీక్షించండి.