హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో ఎడిషన్లో టీమ్ అల్ఫా, సమా ఏంజెల్స్ టైటిల్ పోరులోకి దూసుకెళ్లాయి. బుధవారం గచ్చిబౌలిలో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సమా ఏంజెల్స్ టీమ్ 5-3తో డీఎస్ఆర్ జట్టుపై గెలిచింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మరో సెమీస్లో విల్లాజియో హైల్యాండర్స్, టీమ్ అల్ఫా స్కోరు 4-4తో సమమైంది. అయితే విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టై బ్రేక్లో అల్ఫా 2-1తో గెలిచి ఫైనల్స్కు అర్హత సాధించింది. ధాయలాండ్లో ఈ నెల 23న జరిగే తుది పోరులో టీమ్ అల్ఫా, సమా ఏంజెల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.