హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు తెరలేచింది. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 9 వరకు జరుగనున్న టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 75 మందికి పైగా సెయిలర్లు పోటీ పడుతున్నారు. మంగళవారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి క్రీడా, పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘గత 35 ఏండ్లుగా జంట నగరాల వేదికగా టోర్నీ జరుగడం చాలా సంతోషంగా ఉంది’అని అన్నారు.