Sahil | హైదరాబాద్, ఆట ప్రతినిధి: పికిల్బాల్ చాంపియన్షిప్లో సాహిల్ రెండు టైటిళ్లతో మెరిశాడు. బుధవారంతో ముగిసిన టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో సాహిల్, ధవల్ జోడీ 15-7తో గౌరవ్దీప్ఘోష్, సికాశ్ ద్వయంపై గెలిచింది.
అదే జోరు కొనసాగిస్తూ మిక్స్డ్ డబుల్స్లో సాహిల్, ప్రాచీ జంట 16-4తో చరిత, వెంకట్ ద్వయంపై గెలిచి టైటిల్ దక్కించుకుంది. గేమ్పాయింట్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో విజేతలకు కోఫౌండర్ సిద్ధార్థ్రెడ్డి ట్రోఫీలు అందజేశారు.