సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలువాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. ఒకవైపు రాహుల్ సారథ్యంలో సఫారీలతో వన్డే సిరీస్ జరుగుతుండగానే.. టీమ్ఇండియా ప్రధాన ఆటగాళ్లు ఇంట్రా స్కాడ్ గేమ్లో తలపడుతున్నారు.
ఇందులో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ సెంచరీతో కదం తొక్కగా.. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు యశస్వి జైస్వాల్ మంచి టచ్లో కనిపించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.