బ్లూమ్ఫాంటైన్: బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో భారత్-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. నవ్దీప్ సైనీ (2/54), ఇషాన్ పొరెల్ (2/26) ధాటికి సఫారీ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కరోనా కొత్త వేరియెంట్ విజృంభణ నేపథ్యంలో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమైనా.. బీసీసీఐ అడుగు ముందుకు వేయడంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ మొదలైంది. సఫారీ జట్టు తరఫున జార్జ్ లిండే (44), టోండర్ (34), ఎర్వీ (38), జుబేర్ (31), సీనెతెంబా (32), జాన్సెన్ (38 బ్యాటింగ్) రాణించారు.