రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (24 నాటౌట్), అనూజ్ రావత్ (22 నాటౌట్) మంచి ఆరంభం అందించారు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడుతూ భారీ షాట్లకు వెళ్లలేదు.
తొలి పవర్ప్లే మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా లేదంటేనే వీళ్లు ఎంత జాగ్రత్తగా ఆడారో తెలుస్తోంది. అయితే ఇద్దరూ చెరో నాలుగు ఫోర్లు బాదారు. మరీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వీళ్లిద్దరూ పవర్ప్లే ముగించారు. తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 48 పరుగులు చేసింది.