టాపార్డర్ మరోసారి చేతులెత్తేసినా కూడా.. రాజస్థాన్పై బెంగళూరును గెలిపించేందుకు లోయర్ ఆర్డర్ పోరాడుతోంది. అనూజర్ రావత్ (26), డుప్లెసిస్ (29), కోహ్లీ (5), విల్లే (0) నిరాశ పరచడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైందని అంతా అనుకున్నారు. చెలరేగి ఆడిన షాబాజ్ అహ్మద్ (45) జట్టుకు విజయాన్నందించేందుకు పోరాడాడు.
కానీ 18వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే షెర్ఫానే రూథర్ఫర్డ్ (5) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (35 నాటౌట్) ఇంకా క్రీజులోనే ఉండటంతో బెంగళూరు అభిమానులకు విజయంపై ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి.