ముంబై: రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో వరుసగా ఆరుకు ఆరు సిక్స్లు కొట్టాలనే పట్టుదలతో తాను ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ పేర్కొన్నాడు. కానీ నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలిందని తెలిపాడు. ఈనెల 22న జరిగిన రాజస్థాన్తో మ్యాచ్లో 6 బంతుల్లో 36 పరుగులు కావాల్సి ఉండగా పావెల్ వరుసగా మూడు సిక్స్లు బాది విజయంపై ఆశలు రేపాడు. అయితే మూడో బంతి నిర్ణీత ఎత్తు కన్నా పైకి వెళ్లడంతో అందరూ నో బాల్గా భావించారు. కానీ అంపైర్ అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై వివాదం నడిచిన విషయం తెలిసిందే.
తాజాగా పావెల్ ఆ ఘటనపై స్పందిస్తూ.. ‘గతంలో ఏం జరిగింది అని కూర్చుని ఆలోచించేంత సమయం మాకు లేదు. మీకు తెలుసా..! మేమెప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే కీలకమైన మ్యాచ్లు ఉన్నాయి. ఆ మ్యాచ్ల్లో విజయం సాధించి టోర్నీలో తదుపరి దశకు వెళ్లాలి. నిజం చెప్పాలంటే ఆ ఆఖరి ఓవర్లో ఆరుకు ఆరు సిక్స్లు కొట్టాలనే నమ్మకంతోనే ఉన్నా. రెండు బాదిన అనంతరం మూడోది కూడా సిక్స్ కొట్టా. అయితే అది నోబాల్ అనుకున్నా. కానీ అంపైర్ తుది నిర్ణయంతో ముందుకు సాగాం. ప్రస్తుతం నా ప్రదర్శన ఉత్తమంగానే ఉంది. గత మ్యాచ్ స్ఫూర్తితో మిగతా మ్యాచ్లకు సిద్ధమై ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే భావనలో ఉన్నా’ అని తెలిపాడు. గురువారం కోల్కతాతో ఢిల్లీ తలపడనుంది.