Hyderabad | న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ టీమ్కు మరోమారు నిరాశే ఎదురైంది. గత మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో బోణీ కొట్టిన హైదరాబాద్ స్థాయికి ఆటతీరు కనబర్చలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ 7-16తో రోహ్తక్ రౌడీస్ చేతిలో ఓటమిపాలైంది. అండర్ కార్డ్ విభాగంలో సిద్దార్థ్ మాలాకర్, సవితా కుమారి విజయాలు సాధించగా, అబ్దుల్మాజిద్ ఓటమిపాలయ్యాడు. మెయిన్ కార్డ్లో యాజర్ అరాఫత్ ఏకపక్షంగా గెలువగా, జగదీశ్, జిన్సీ జోస్ ఓడటం హైదరాబాద్ అవకాశాలను దెబ్బ తీసింది. బుధవారం కొచ్చి కేడీస్తో హైదరాబాద్ తలపడుతుంది.