టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో అరుదైన రికార్డుకు తెరలేపాడు. టీ20 మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 3000 పరుగులు చేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్స్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో లిస్టులో రోహిత్ శర్మ కూడా చేరాడు. టీ20 ప్రపంచకప్స్లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసి నెంబర్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా.. మూడో స్థానానికి రోహిత్ శర్మ చేరుకున్నాడు.