Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రీజులోకి వచ్చాడంటే సిక్సర్ల మోత మోగాల్సిందే. విధ్వంసక ఇన్నింగ్స్లకు పెట్టింది పేరైన హిట్మ్యాన్ ధర్మశాల టెస్టు(Dharmashala Test)లో తన బ్యాట్ పవర్ చూపిస్తూ ‘రికార్డు బ్రేకింగ్ సెంచరీ’ బాదాడు. ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని చీల్చిచెండాడుతూ 12వ టెస్టు సెంచరీ సాధించాడు.
దాంతో, హిట్మ్యాన్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 48 శతకంతో అతడు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) రికార్డు సమం చేశాడు. అంతేకాదు ఓపెనర్గా ఎక్కువ శతకాలు బాదిన మూడో ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
Of hundreds and celebrations! 👏 🙌
Rohit Sharma 🤝 Shubman Gill
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe
— BCCI (@BCCI) March 8, 2024
వెస్టిండీస్ మాజీ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle)ను రోహిత్ దాటేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 49 సెంచరీలతో టాప్లో ఉండగా.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ 45 శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు.
💯 for Rohit Sharma! 🙌
His 12th Test ton! 👏
Talk about leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/LNofJNw048
— BCCI (@BCCI) March 8, 2024
ఇంగ్లండ్పై రోహిత్కు ఇది మూడో సెంచరీ. దాంతో, ఆ జట్టుపై అత్యధికసార్లు మూడంకెల స్కోర్ చేసిన రెండో భారత ఓపెనర్గా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) 4 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విజయ్ మర్చంట్ మూడో స్థానానికి పడిపోయాడు. 2021 తర్వాత ఎక్కువ సెంచరీలు బాదిన టీమిండియా తొలి క్రికెటర్గా రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు.
It’s Lunch on Day 2 of Dharamsala Test!
A 129-run First Session for #TeamIndia as captain Rohit Sharma & Shubman Gill zoomed past hundreds 👏 👏
Stay Tuned for Second Session ⌛️
Scorecard ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P5WFrukIw8
— BCCI (@BCCI) March 8, 2024
అతడు 6 సార్లు వంద మార్క్ చేరుకోగా.. యువ కెరటం శుభ్మన్ గిల్(Shubman Gill) 4 సార్లు సెంచరీ బాది రెండో స్థానం దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మూడు సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)లో ఇప్పటివరకూ రోహిత్ 54 ఇన్నింగ్స్లు ఆడాడు. అందులో 9 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదేశాడు. ధర్మశాల టెస్టులో రోహిత్, గిల్ అజేయ శతకాలతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ సమయానికి 46 పరుగుల ఆధిక్యం సాధించింది.