కేప్టౌన్: 2022 టీ20 ప్రపంచకప్ నుంచి పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. సీనియర్ల అవసరం జట్టుకు ఉందని భావించిన సెలెక్షన్ కమిటీ.. వీరిద్దరినీ అఫ్గాన్తో సిరీస్కు ఎంపిక చేసింది.
పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే కాగా.. ఈ నెల 11 నుంచి భారత్, అఫ్గాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్కు మొహాలీ ఆతిథ్యమివ్వనుంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ గాయంతో జట్టుకు దూరం కాగా.. తెలంగాణ ప్లేయర్ తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ టీమ్లో చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, బుమ్రా, సిరాజ్, జడేజాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి, కోహ్లీ, తిలక్, రింకూ, జితేశ్, శాంసన్, శివమ్, సుందర్, అక్షర్, రవి, కుల్దీప్, అర్ష్దీప్, అవేశ్, ముఖేశ్.