డెహ్రాడూన్: కారు యాక్సిడెంట్కు గురైన క్రికెటర్ రిషబ్ పంత్.. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతను ఐపీఎల్ 2023 సీజన్లో ఆడేది డౌట్గా కనిపిస్తోంది. పంత్కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. రిషికేశ్లోని ఎయిమ్స్ డాక్టర్ ఖామర్ ఆజమ్ ప్రస్తుతం పంత్కు చికిత్స అందిస్తున్నారు. లిగమెంట్ గాయం నుంచి పంత్ కోలుకోవాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్ ఆజమ్ తెలిపారు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే, అప్పుడు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
పంత్ గాయాలు మానకుంటే అతను ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్కు కూడా దూరం అయ్యే ఛాన్సు ఉంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో పంత్ రాణించిన విషయం తెలిసిందే. ఒకవేళ పంత్ ఆడలేని పక్షంలో.. కొత్త ప్లేయర్ కేఎస్ భరత్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడుతున్నాడు. ఇక ఇప్పుడు ఆ జట్టు యాజమాన్యం కూడా మరో ప్లేయర్ కోసం ఎదురుచూడక తప్పదు.